Special Message - మట్టలాదివారపు బైబిల్ అధ్యయనం

 

  • చాలా మంది వృద్ధులు పెద్ద అక్షరములే చదువగలిగినందు చేత పెద్ద అక్షరములు వాడుతున్నాము. 

    • దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం.  sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్  లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి. 

  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com. 

  • Or send a message by Whats App to 98663 41841

మట్టలాదివారపు బైబిల్ అధ్యయనం

     మీరంతా బాగున్నారా? కష్టాలు, కన్నీళ్లు ఎల్లప్పుడు ఉండవు. పరిశుద్ధ గ్రంధం బైబిల్లోనుండి సామెతల గ్రంధం 

17:3 లో ఉన్న దేవుని మాటలు వినండి: “వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది…..” కొలిమిలో 

మలినమంతా కరిగిపోయినట్టే, మన జీవితాల్లో ఉన్న అనవసరమైనవన్నీ తొలిగిపోతాయి. కనికరము గల దేవుడు 

కష్టాలను, వేదనలను, నిందలను తన మంచి ఉద్దేశ్యం కోసం వాడుకుంటాడు. రోమా. 8:28 చదవండి, కంఠస్థం చేసి 

భద్రం చేసుకోండీ. కాబట్టి క్రుంగి పోకండి, నిరాశపడకండి, జీవితాన్ని, పరిస్థితులను, ప్రజలను ఎదుర్కొని, 

విజయముతో జీవించడానికి ప్రభువు మనకందరికీ సహాయం చేయగల శక్తిమంతుడు. ప్రార్ధించుకుందామా?  

ఈ ప్రభువుదినము ప్రత్యేకమైన ప్రభువు దినం. ఎందుకనగా ఇది మట్టలాదివారము. మట్టలాదివారo యేసు 

ప్రభువు యేరూషలేములో ప్రవేశించిన దినము. దీన్నిగూర్చి మత్తయి, మార్కు,  లూకా, యోహాను సువార్తలలో వ్రాయబడింది. 

మత్తయి 21:1-17; మార్కు 11:1-11; లూకా 19:28-44; యోహాను 12: 12-19. 

ఈనాటి లేఖన భాగం లూకా 19:28-38,

 

         28. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ల వలెనని ముందు సాగిపోయెను.

 

            29. ఆయన ఒలీవల కొండదగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామముల సమీపమునకు           

వచ్చినప్పుడు, తన శిష్యుల నిద్దరిని పిలిచి

 

             30. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక             

గాడిద పిల్ల మీకు కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడు కూర్చుండలేదు

 

           31. ఎవరైనను మీరెందుకు దీని విప్పు చున్నారని మిమ్మునడిగినయెడల ఇది ప్రభువునకు    

కావలసియున్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను.

 

           32. పంపబడిన వారు వెళ్లి, ఆయన తమతో చెప్పినట్టే కనుగొని

 

           33. ఆ గాడిదపిల్లను విప్పుచుండగా దాని యజమానులుమీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని 

వారి నడిగిరి.

            34. అందుకు వారు ఇది ప్రభువునకు కావలసియున్నదనిరి.

            35. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి, ఆ గాడిదపిల్ల మీద తమ బట్టలువేసి,             

యేసును దానిమీద ఎక్కించి 

            36. ఆయన వెళ్లుచుండగా తమ బట్టలు దారిపొడుగున పరచిరి.

            37. ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించు చున్నప్పుడు శిష్యుల సమూహమంతయు        సంతోషించుచు

            38. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన             

స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినిగూర్చి మహా  శబ్దముతో 

దేవుని స్తోత్రము చేయసాగిరి.

 

      ఎందుకు యేసు క్రీస్తు ప్రభువు యెరూషలేములో విజయపు ఉత్సవముతో ప్రవేశిస్తున్నారు? అనే ఈ ప్రశ్నకు

 జవాబు తెలుసుకుందాం. ప్రభువు ఎన్నడూ పబ్లిసిటీ కోరలేదు. తన అద్భుతాలు సహితం ఇతరులతో చెప్పవద్దని 

హెచ్చరించాడు. మార్కు 1:43,44: మత్త. 5:14 తన్ను ప్రసిద్ధి చేయవద్దని చెప్పిన సంఘటనలు ఉన్నాయి. కానీ 

ఇక్కడ జరిగేది దానికి విరుధ్ధంగా ఉంది. గమనించారా? ప్రభువే స్వయంగా అన్ని ఏర్పాట్లు చేసి జెకార్యాలోని   

ప్రవచనపు నెరవేర్పుగా యెరూషలేము పట్టణంలోనికి రాజుగా విజయపు ప్రవేశము చేస్తూఉన్నాడు. శిష్యులు, ఇతర 

ప్రజలు పరచిన బట్టలపైన ప్రభువు కూర్చోని ఊరేగింపుగా వెళుతూ ఉన్నాడు. ముందు, వెనుక నడిచేవారు 

“ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతించబడుగాక, హోసన్న” అంటూ ప్రభువును రాజుగా ఘనపరుస్తూ స్తుతిస్తూ 

ఉన్నారు. ఇదే ప్రజలు కేవలం 5 రోజుల తరువాత “సిలువ వేయుము, సిలువ వేయుము” అని కేకలు వేస్తారని  

సర్వమునెరిగిన రక్షకుడు యేసు క్రీస్తునకు తెలుసు. అయినా ప్రభువు ఎందుకు యెరూషలేము లోనికి రాజుగా 

విజయపు ఊరేగింపుగా వెళుతున్నాడు? ప్రభువు ఈ భూమ్మీదికి మానవ స్వరూపములో వచ్చింది పాపపు 

బానిసత్వములో బందీలుగా ఉన్నవారిని విమోచించడానికి. ప్రభువు ఇద్దరు దొంగల మధ్యలో అతి కిరాతకమైన 

హింసననుభవించి బల్లెముతో ప్రక్కలో పొడువబడి, తలమీద ముళ్ళ కిరీటముతో అవమానకరమైన మరణము ఇంకా

5 రోజుల్లోనే పొందబోతున్నాడని ప్రభువునకు బాగా తెలుసు. ఆ ప్రజల స్తుతులు, జై జై లు కేవలo క్షణికమైనవని, 

పెదవులమీదివేనని యేసు రక్షకునికి బాగా తెలుసు. అయినా ప్రభువు ఎందుకు తన ముఖమును 

చెకుముకిరాయిలాగా చేసుకొని, ధృడమైన నిశ్చయంతో యెరూషలేమునకు ప్రయాణమైనట్టు? ప్రభువు తాను 

మానవస్వరూపం ధరించిన ఉద్దేశ్యమును నెరవేర్చాలని ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆ సమయంలో ప్రభువు 

ఎవరి గురించి ఆలోచించి ఉండవచ్చు? మొదటిగా తండ్రిని మహిమగురించి, రెండవది నీముఖం నాముఖం 

ఆయనకు కనబడింది, నీకు, నాకు ఆయన పరిశుద్ద రక్తము, తన సిలువ మరణము తప్ప వేరే విమోచన మార్గము 

 లేదని ముందుకే వెళ్ళాడు. ప్రియ సోదరీ, సోదరుడా, నీ పాపపు రుణమును యేసు ప్రభువు సంపూర్ణంగా 

తీర్చాడు. అందుకే సిలువ మీద తన ప్రాణము పోయే సమయంలో అన్న మాట “సమాప్తం” గ్రీకులో “టేటేలేస్టై” 

అంటారు. ఈ మాటను ఆదినాల్లో ఒక వ్యక్తి తన అప్పు అంతా చెల్లించిన తరువాత ఋణ పత్రాల మీద వ్రాసే మాట. 

మరోమాటలో చెప్పాలంటే ఇది లీగల్ భాషలో వాడే మాట.  న్యాయపరమైన మాట. యేసు క్రీస్తు ప్రభువు నీ 

పాపమంతటికోసం తన రక్తం, ప్రాణం పరిహారంగా ఇచ్చి ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన పాప క్షమాపణను ఒక 

కానుకగా నీకివ్వాలని పిలుస్తూఉన్నాడు. విశ్వాసముతో, వినయముతో, దాన్ని స్వీకరించడానికి నీవు సిధ్ధమా?

 

     ఈ లేఖన భాగములో మరో ముఖ్యమైన విషయముంది. ప్రజలు కేకలు వేసిన మాటలలో ఒక మాట, 

“పరలోకమందు సమాధానము”. లూకా 19:38. మీ బైబిల్లో గమనించారా? 3 సువార్తలలో వైద్యుడైన లూకా ఒక్కడే 

ఇది వ్రాశాడు. యేసు ప్రభువు జన్మించినపుడు దూతలు చేసిన స్తోత్రములో ఉన్న మాట ఏమిటి? “భూమి మీద 

సమాధానము” లూకా 2:14 యేసు ప్రభువునకు యెషయా 9:6లో ఇవ్వబడిన బిరుదులలో  ఒకటి, సమాధాన 

కర్త, అధిపతి.  గమనిస్తున్నారా, శ్రోతలూ? సత్య దేవునికి, మానవాళికి దేవునితో పాపమునుబట్టి సంబంధం 

తెగిపోయింది. దేవునితో సమాధానము లేదు. అందుకే మన జీవితాల్లో సమాధానం లేదు. తిరిగి ఈ సంబంధం బాగు 

కావాలంటే పాపమునకు పరిశుద్ధ రక్తముతో ప్రాయశ్చిత్తం చేయాలి. అది ఎవ్వరూ చేయలేరు. అది చేయడానికే 

యేసు ప్రభువు మానవ స్వరూపము ధరించాడు. మన అందరి స్థానములో ధర్మశాస్త్రమును నెరవేర్చాడు. 

(మత్త.5:17) దేవుని గొర్రె పి‌ల్లగా పరిహారం పాపపరిహారం చేశాడు. ఈ సత్యమును విశ్వసించి పాప క్షమాపణ 

పొందినవారే దేవునితో తెగిపోయిన సంబంధమును బాగుచేసుకొని ఆయనకు కుమారులు కుమార్తెలు అవుతారు. 

(యోహాను. 1:12) యేసు ప్రభువు విజయపు ఉత్సాహముతో యేరూషలేములో ప్రవేశించే సమయములో 

ఏమన్నారో మనము జాగ్రతగా పరిశీలించాలి. “ ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని 

విషయమై యేడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో 

మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి. (ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు 

ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ 

పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను.” 

యేసు ప్రభువు ఏడ్చిన సందర్భాలు కొన్నే. యేరూషలేము ప్రజలు ప్రభువును తిరస్కరించారు. ఆయన మెస్సీయ 

అని, రక్షకుడని నమ్మలేదు. మరి నీ సంగతేమిటి? ఇప్పుడైనా మారు మనస్సు పొందమని ప్రభువు వారిని ఆనాడు 

హెచ్చరించినట్లే, నిన్ను ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు. 43, 44 వచనాల్లో యెరూషలేము నేలమట్టం 

చేయబడుతుందని ప్రభువు ప్రవచన పూర్వకంగా హెచ్చరించాడు. ఇది అక్షరాల క్రీ.శ. 70 లో రోమా ప్రభుత్వపు 

చరిత్రలో నేరవేరింది.  వెస్పాసియన్, టైటస్ అనే అధిపతులు ఇది

చేశారు. యేసు రక్షకుని తిరస్కరిస్తే తీర్పు తప్పదు. ప్రభువు చేసిన ఈ రక్షణ పాపక్షమాపణ పొందే సమయం 

ముందు కాలములో నీకు ఉండకపోవచ్చు. ఎవరికి ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. సోదరీ, సోదరుడా, 

“సిలువ వేయుము అని కేకలు వేసే గుంపులో ఉన్నావా? దేవునితో నీ సంబంధం తెగిపోయిన విషయం 

గుర్తించావా? యేసు రక్షకుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ పాపపు శిక్ష అంతా ప్రభువే భరించి సహించాడు. నీ   

పాపపు రుణప్రత్రo మీద “సమాప్తం” అని ఆయన రాయడానికి ఒప్పుకుంటావా? లేదా ఆయనను తృణీకరించి 

తీర్పుకులోనవుతావా? నిర్ణయం నీదే!       

 

రోమా పత్రిక అధ్యయనం-34 9: 14-24 దేవుని క్రియలకు ఆధారం ఏమిటి?

 

  • చాలా మంది వృద్ధులు పెద్ద అక్షరములే చదువగలిగినందు చేత పెద్ద అక్షరములు వాడుతున్నాము. 

    • దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం.  sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్  లేదా వాట్సప్ 8143178111 ద్వారా నైనా తెలియచేయండి. 

  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com. 

  • Or send SMS or a message by WhatsApp to 8143178111

        ఆడియో అధ్యయనం చివర్లో ఉంది దయచేసి గమనించండి:          

 రోమా పత్రిక అధ్యయనం-34  9: 14-24

దేవుని క్రియలకు ఆధారములేమిటి?

  

   దేవునికి స్తోత్రం! బాగున్నారా? “సజీవ నిరీక్షణ” ద్వారా మీరు ఏ విధమైన ధైర్యం, హెచ్చరికలు, దీవెనలు, 

 ఆశీర్వాదాలు పొందుతున్నారో తెలియచేయకూడదూ?  మీ జీవిత విధానములో మార్పులు కలుగుతున్నాయా? 

మీ ప్రార్థన అవసరతలు, అంశాలు మాకు తెలియచేయండి. బైబిల్ అనుదినం క్రమo తప్పకుండ చదువుతున్నవారు 

ఆ విషయం మాకు తెలియచేసినట్లయితే ముగించడానికి ప్రభువు మీకు శక్తి, కృప పట్టుదల అనుగ్రహించాలని మీ 

కోసం ప్రార్థిస్తాము. ఆ విషయం మాకు తెలియచేయవచ్చు. మా ఫోన్ నంబర్ 8143178111 ఈ ఫోన్లో వాట్సప్ 

కూడా ఉన్నది. లేదా ఉత్తరం రాయాలనుకుంటే, sms  లోగాని,  వాట్సప్ లోగాని, మీరు అడ్రెస్ అడిగినట్లయితే 

అడ్రసు పంపిస్తాo.

 

      కరుణ దేవుని గుణములలో ఒకటి. ఆయన యొక్క నీతి, న్యాయము అనే గుణములమీద అది ఆధారపడి 

ఉంటుoది. దేవుడు న్యాయవంతుడు కాకపోయినట్లయితే, కరుణించలేడు. ఆయన న్యాయవంతుడు కాబట్టి కరుణ 

కలిగి ఉండగలడు, కరుణ కలిగి ఉంటాడు. దేవుడు తన అధికారాన్ని చలాయించి తన చేతిక్రింద ఉండే వారిమీద తన 

ఇష్టమును, చిత్తమును బలవంతంచేసే నియంత, నిరంకుశుడు కాదు. ఆయన మన క్షేమం కోరే శ్రేయోభిలాషి. 

ఆయన మన మేలును తన మహిమను కోరుకుంటాడు.

 

     దేవుని క్రియలకు ఆధారం ఆయన కరుణ. ఈ పూట దేవుని కరుణ గురించి మనమంతా కలిసి  

 ధ్యానిoచుకుందాం, రండి రేడియోకు దగ్గరగా వచ్చి ప్రశాంతంగా సంతోషంగా కూర్చోoడి. రోమా పత్రిక 9:14-24. 

ముందుగా ప్రార్ధించుకుందాం, తలలు వంచండి. ప్రార్థన. రోమా 9:14-24

 

         14 కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు.
              15
అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడుఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల            జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును.
              16
కాగా పొందగోరువానివలననైనను, ప్రయాసపడువాని వలననైనను కాదు గాని,కరుణించు    దేవునివలననే అగును.
              17
మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను నేను నీయందు నా బలము చూపుటకును, నా            నామము భూలోకమందంతట ప్రచురమగుటకును, అందు నిమిత్తమే నిన్ను నియమించితిని.
              18
కావున ఆయన ఎవనిని కనికరింప గోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచ గోరునో వాని కఠిన          పరచును.
              19 అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరముమోపనేల అని నీవు నాతోచెప్పుదువు.
              20
అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు? నన్నెందు కీలాగు చేసితివని            రూపింపబడినది రూపించినవానితో చెప్పునా?
              21
ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద       కుమ్మరివానికి అధి కారము లేదా?
              22
ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చ         యించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు ధీర్ఘశాంతముతో సహించిన నేమి?
              23
మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక,
              24
అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమై శ్వర్యము            కనుపరచవలెననియున్న నేమి?                

     దేవుడు తన కరుణను చూపించే మార్గాలేమిటో తెలుసుకోవడానికి ఈ లేఖనభాగము అధ్యయనం చేయాలి.

      

       మొదటిది, దేవుడు తన కరుణను తన దయ ద్వారా చూపిస్తాడు.  16వ వచనమును లోతుగా 

అధ్యయనం చేద్దాం. బైబిల్లో గమనిస్తున్నారా?ఎవనిని కరుణింతునో వానిని 

కరుణింతును” కరుణ అంటే దయ చూపించడం. జాలిచూపి బాధపడడం. దేవుడు మన గురించి బాధపడతాడు, 

కాబట్టి మనలను కరుణిస్తాడు. మనమీద జాలిచూపిస్తాడు. ఇది ఆయనయొక్క నీతిమంతత్వమును చూపించే 

పధ్ధతి. 14వ వచనంలో పౌలు “దేవునియందు అన్యాయము కలదా?” అని ప్రశ్నితూ ఉన్నాడు. లేదనే సమాధానం. 

దేవునిలో అన్యాయం ఎన్నటికీ ఉండనేరదు. దేవుడు తన నీతిని బహిర్గతం చేయడానికి కరుణించడం ఒక మార్గం. 

ఆయనకు మనలను చూచినపుడు దయ, కరుణ కలుగుతుంది. ఆయన తన కరుణను, దయద్వారా 

చూపిస్తున్నాడు, దీన్ని తన చిత్తమును బట్టి అర్ధం చేసుకోవచ్చు. 16వ వచనమును జాగ్రతగా పరిశీలించండి. “  

పొందగోరువానివలననైననుప్రయాసపడువాని వలననైనను కాదు గాని, కరుణించు దేవునివలననే అగును”. ఇది 

దేవుని కోరికను మనపట్ల ఆయన ఇష్టమును చూపిస్తుంది.    


     సోదరీ సోదరులారా, దేవుడు తన కరుణను తన దయచేత చూపిస్తాడు. ఆయన హృదయం మన కోసం  

ఆరాటపడుతుంది. మనము ఎంత నిస్సహాయస్థితిలో ఉన్నామో తెలుసు గనుక మన పట్ల దయతో కనికరం 

ఆయన చూపుతూ ఉన్నాడు. అవును, అమెన్! దేవునికి మహా స్తోత్రం!!

 

     రెండవది, ఆయన తన శక్తితో మన పట్ల తన కరుణను చూపిస్తున్నాడు. దేవుడు ఇక్కడ చేస్తున్న 

ఎంపికలు గమనించండి.  కాస్త కష్టమేగాని, కొంచెo ధీర్ఘంగా ఆలోచిస్తే ఆపో. పౌలు చెప్పేది 

బోధపడుతుంది. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు లోనుండి విడిపించడానికి మోషే ను పంపినపుడు అక్కడ ఉన్న 

రాజు పేరు ఫరో. మీరు దీని విషయం తెలుసుకోవాలంటే బైబిల్లోని రెండవ గ్రంధం నిర్గమ కాండం చదవాలి. ఫరోను 

ఒక ప్రత్యేక ఉద్దేశ్యముతో దేవుడు నియమించానని సెలవిచ్చాడు. అదేమిటి? తన శక్తిని చూపించడానికి. 17వ 

వచనం చూడండి: “నేను నీయందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతట 

ప్రచురమగుటకునుఅందు నిమిత్తమే నిన్ను నియమించితిని.” దేవుడు తన శక్తిద్వారా, తన కరుణను 

చూపిస్తున్నాడు.

 

    ఫరో ఇశ్రాయేలు ప్రజలను వెళ్లనివ్వనని మొండికేశాడు. దేవుడు ఫరోను శిక్షించి, గద్దించి, కఠినమైన తీర్పులు, 

తెగుళ్లు అతని మీదికి పంపించాడు. కారణం? ఫరో దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశాడు. దేవుడు తన శక్తిని 

ఉపయోగించడం ద్వారా కరుణా చూపించి ఫరోను అణిచి అతనికి పాఠం నేర్పాడు.  ఇశ్రాయేలు ప్రజలను ఫరో 

తరుముతున్నపుడు దేవుడు ఫరోను ఎర్ర సముద్రంలో ముంచి వేశాడు. ఐగుప్తు రాజుగా ఉన్న ఫరో దేవుని 

ధిక్కరించినపుడు ఆయన తన శక్తిని చూపించడంద్వారా దేవుడు కరుణించాడని మనము తెలుసుకోవాలి. 18వ 

వచనం గమనించాలి “ఆయన ఎవనిని కనికరింప గోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచగోరునో వాని 

కఠినపరచును.” ఇది వింటున్న మనలో వచ్చే ప్రశ్నలకు ఆపో. పౌలు వద్ద సమాధానముంది. ఇప్పుడు మన 

మనసుల్లో మెదిలే ప్రశ్న 19వ వచనములో ఉంది. “అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన 

ఇకను నేరము మోపనేల?” ‘దేవుడే ఫరోను నియమించి, ఆయనే ఫరో హృదయమును కఠినపరచినపుడు, ఇక ఫరో 

తప్పేముంది?’ అని ఆలోచిస్తున్నారా? శ్రోతలూ, ఇక్కడ అత్యంత ప్రాముఖమైన సత్యమున్నది. మనకు జవాబు 

చెప్పే అవసరం దేవునికి లేదు. దేవుడు తన శక్తితో, తన ఉద్దేశ్యం కోసం, తన స్వభావమునుబట్టి క్రియలు చేస్తాడు. 

మన ప్రశ్నలకు జవాబు చెప్పమని అడిగే అధికారం మనకు లేదు. కాబట్టి గమ నించoడి, దేవుడు తన 

చిత్తమునుబట్టి తన శక్తి ద్వారా తన కరుణను చూపిస్తున్నాడు, ఆయనకే స్తోత్రం!


       ఇక మూడవది, తన ఉగ్రత ద్వారా దేవుడు తన కరుణను చూపిస్తాడు.  22వ వచనం చూద్దాం. “దేవుడు 

తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ...” నిశ్చయించుకున్నాడు. దేవుని కరుణ, 

ఆయన న్యాయము, ఆయన నీతి మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకున్నామా లేదా? ఆయన న్యాయము 

ప్రకారము పాపమును చూస్తూ ఊరకుండలేడు గనుక ఉగ్రత చూపిస్తాడు. దేవుని చట్టము, ఆయన చిత్తమునకు 

విరోధంగా ప్రవర్తించడం పాపము. దేవుని చట్టమును ధిక్కరించిన ప్రతి ఒక్కరూ ఆయన ఉగ్రతను రుచి చూస్తారు. 

ఇది సత్యం. 

     ఆయన తన ఉగ్రత చూపించినా, తన కరుణ చూపిస్తున్నందుచేత మహిమ పరచబడతాడు. 23వ 

వచనం గమనించాలి. “మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర 

ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక,….ఆయన పిలిచిన మనయెడల... తన 

మహిమై శ్వర్యము కనుపరచవలెననియున్ననేమి?” అవును, సోదరీ, సోదరుడా, నీలో నాలో ఆయన 

మహిమపరచబడాలనే ఉద్దేశ్యము 

దేవునికి ఉన్నది. ఆయన పిలుపు నీవు వింటున్నావా? దేవుడు తన కరుణను నీకు చూపించాలని కోరుతున్నాడు. 

ఆయన కరుణను తిరస్కరిస్తే ఉగ్రత తప్పదు. ఆయన న్యాయవంతుడు గనుక తిరస్కరించినవారిని విడిచిపెట్టడు. 

దేవుని కరుణను చులకనగా తీసుకొని, ఉద్దేశ్యపూర్వకంగా తెలిసి తెలిసి, పాపములో ఉండకండి. నీ జీవితమును, 

హృదయమును బాహాటంగా తెరిచి ఆయన కరుణను నిండారుగా ఆస్వాదించు! దానికి కోసం అవసరమయ్యే కృప 

ప్రభువు తన కరుణను బట్టి మనకందరికీ అనుగ్రహించుగాక! అమెన్!!              

 

 

 

 

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...